Breaking: పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్.. కీలక నేతలంతా ఆ పార్టీలోకి జంప్!

by Disha Web Desk 3 |
Breaking: పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్.. కీలక నేతలంతా ఆ పార్టీలోకి జంప్!
X

దిశ డైనమిక్ బ్యూరో: టీడీపీ, జనసేన పొత్తు ఆ పార్టీల్లో చిచ్చుపెడుతోంది. మొదటి నుండి ఇరు పార్టీల అధినేతలు పొత్తుతో పనిచేస్తామని చెప్తున్నారు. అయితే మొదటి నుండి ప్రజాక్షేత్రంలో మాత్రం ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు కత్తులు దూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థులను ప్రకటిస్తూ తొలి జాబితాను విడుదల చేయడంతో అగ్నికి ఆర్జ్యం పోసినట్టయింది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. టికెట్ దక్కని జనసేన నేతలు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాగా శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు అనే సామెతను శిరసావహిస్తున్న వైసీపీ జనసేన అసంతృప్తవాదులను తన వైపు తిప్పుకునేందుకు వ్యూహ రచన చేస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి.. జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్‌తో భేటీ అయ్యి మంతనాలు జరిపారని సమాచారం. అసంతృప్తితో ఉన్న జన సైనికులను వైసీపీ నేతలు కలిసి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. వైసీపీ విషపు ఉచ్చులో జన సైనికులు, వీర మహిళలు పడవద్దని.. రాష్ట్ర క్షేమం కోసం నిస్వార్థంగా పని చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అని.. పొత్తులో భాగంగా రెండు పార్టీల్లోనూ కొన్ని త్యాగాలు తప్పవని.. వైసీపీ నాయకులు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని జనసేన పార్టీ పోస్ట్‌‌లో రాసుకొచ్చింది.

Next Story